అక్షరటుడే, లింగంపేట: Lingampet | కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) రైతుల పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం ఈ పొలాలను పరిశీలించారు.
దీంతో శుక్రవారం స్పందించిన డీఆర్డీవో సురేందర్ మాట్లాడుతూ.. భారీవర్షాలకు రైతుల పొలాల్లో ఉన్న ఇసుకమేటలను ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలతో తొలగింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేశ్, ఎంపీవో, ఏపీవో, టీఏ, ఎఫ్ఏ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.