Homeజిల్లాలునిజామాబాద్​MP Arvind | ఆర్వోబీల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి : ఆర్థిక మంత్రిని కలిసిన...

MP Arvind | ఆర్వోబీల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి : ఆర్థిక మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్​

జిల్లాలోని మూడు అర్వోబీల పెండింగ్​ బిల్లులు మంజూరు చేయాలని ఎంపీ అర్వింద్​ కోరారు. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్కను బుధవారం ఆయనను కలిశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: MP Arvind | జిల్లాలో మూడు ఆర్వోబీలకు సంబంధించి పెండింగ్​లో ఉన్న నిధులను విడుదల చేయాలని ఎంపీ అర్వింద్​ (MP Arvind) కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కను (Finance Minister Bhatti Vikramarka) హైదరాబాద్​లోని ఆయన కార్యాలయంలో ఎంపీ బుధవారం కలిశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మాధవనగర్​, అర్సపల్లి, అడవి మామిడిపల్లి ఆర్వోబీలకు సంబంధించిన బిల్లులు కొన్నినెలలుగా పెండింగ్​లో ఉన్నాయన్నారు. బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. పెండింగ్​ బిల్లులను సత్వరమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.