ePaper
More
    HomeజాతీయంKarnataka | జీతం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు.. రిటైర్డ్​ గుమాస్తా ఆస్తులు చూసి...

    Karnataka | జీతం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు.. రిటైర్డ్​ గుమాస్తా ఆస్తులు చూసి షాకైన అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | వ్యవస్థలో అవినీతి భాగం అయిపోయింది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అటెండర్​ నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

    తాజాగా ఓ రిటైర్డ్​ గుమాస్తా (Retired Clerk) ఆస్తులు చూసి అధికారులు షాక్​ అయ్యారు. నెలకు రూ.15 వేల జీతంలో పనిచేసిన ఆ ఉద్యోగి ఆస్తులు ఏకంగా రూ.30 కోట్లు ఉండడం గమనార్హం. కర్నాటకలోని (Karnataka) కొప్పల్‌ జిల్లా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్‌లో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి గుమస్తాగా పని చేశాడు. ఆయన ప్రస్తుతం రిటైర్డ్​ అయ్యారు. అయితే లోకాయుక్త అధికారులు తాజాగా ఆయన ఇంట్లో సోదాలు చేపట్టగా కీలక విషయాలు వెలుగు చూశాయి. రూ.15 వేల జీతంతో పని చేసిన గుమాస్తా రూ.30 కోట్ల ఆక్రమాస్తులు కూడ బెట్టినట్లు అధికారులు గుర్తించారు. మాజీ ఇంజినీర్​ చిన్చోల్కర్‌తో కలిసి నిడగుండి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు ప్రాజెక్ట్​లకు ఫేక్​ బిల్లులు, పత్రాలు సృష్టించి రూ.72 కోట్లు కాజేశారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

    READ ALSO  Supreme Court | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్​.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

    Karnataka | 24 ఇళ్లు.. 40 ఎకరాల భూమి

    మాజీ గుమాస్తా నిడగుండికి 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి ఉన్నట్లు లోకాయుక్తా అధికారులు (Lokayukta Officers) గుర్తించారు. అంతేగాకుండా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పలు ఆస్తులు ఉన్నాయి. ఆయన ఇంట్లో 1.5 కిలోల వెండి, 350 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

    దేశవ్యాప్తంగా అవినీతి రాజ్యమేలుతోంది. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి ఐఏఎస్​ అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం (Government job) వస్తే తమను ఎవరు ఏమి చేయలేరనే భావనతో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక గుమస్తా ఏకంగా రూ.30 కోట్ల ఆస్తులు (Rs. 30 Crores Property) కూడబెట్టాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్​గా మారింది. గుమాస్తానే రూ.30 కోట్లు సంపాదిస్తే సదరు ఇంజినీర్​ ఎంత సంపాదించాడనేది విచారణలో తేలనుంది.

    READ ALSO  Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్​ విడుదల

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...