అక్షరటుడే, వెబ్డెస్క్ : Transfers | రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్ అధికారులను, 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ జీఏడీ పొలిటికల్ సెక్రెటరిగా నియమితులయ్యారు. వ్యవసాయ, సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు వాణిజ్య పన్నుల కమిషనర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్పోర్టు కమిషనర్గా రఘునందన్రావు బదిలీ అయ్యారు. సురేంద్ర మోహన్ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
Transfers | సిరిసిల్ల కలెక్టర్గా హరిత
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. తాజాగా సిరిసిల్ల కలెక్టర్గా విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న ఎం.హరితను నియమించింది. కె. హరిత ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
Transfers | ఇంటెలిజెన్స్ చీఫ్గా విజయ్కుమార్
ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్రెడ్డిని ప్రభుత్వం డీజీపీ (DGP)గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పదవికి విజయ్కుమార్ను ఎంపిక చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొనసాగుతున్న సీవీ ఆనంద్ (CV Anand) హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నగర సీపీగా ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న వీసీ సజ్జనార్కు బాధ్యతలు అప్పగించింది. అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్, ఆర్డీసీ ఎండీగా నాగిరెడ్డి, గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ బదిలీ అయ్యారు.
హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్, వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్ నియమితులయ్యారు. నారాయణ పేట్ ఎస్పీగా వినీత్, సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా సింధు శర్మను ప్రభుత్వం బదిలీ చేసింది. రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, ఎల్బీ నగర్ డీసీపీగా అనురాధ, మాదాపూర్ డీసీసీగా రీతిరాజ్ ట్రాన్స్ఫర్ అయ్యారు.