Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | ట్రాన్స్​ఫార్మర్లకు భద్రత​.. అధికారుల వినూత్న ఆలోచన

Nizamsagar | ట్రాన్స్​ఫార్మర్లకు భద్రత​.. అధికారుల వినూత్న ఆలోచన

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | ఖరీఫ్ కోసం రైతులు పొలంపనుల్లో తలమునకలై ఉన్నారు. కానీ, ఇటీవల ట్రాన్స్​ఫార్మర్ల (Transformers) చోరీలు పెరుగుతుండడంతో వారిలో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసులు, ట్రాన్స్​కో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాన్స్​ఫార్మర్లకు చుట్టూ ఇనుప గ్రిల్ తో వెల్డింగ్​ చేయిస్తున్నారు.

ఎస్సై శివకుమార్​ (SI Shivakumar), విద్యుత్​ శాఖ సిబ్బంది (Electricity Department) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అచ్చంపేట శివారులో రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ను తెరవడానికి వీలు లేకుండా ఇనుప రాడ్లతో వెల్డింగ్​ చేయించారు. తద్వారా ఆయిల్​, కాయిల్స్​ చోరీని నివారించవచ్చని వారు పేర్కొన్నారు. మిగితా రైతులు సైతం తమ పొంటపొలాల వద్ద ఉన్న ట్రాన్స్​ఫార్మర్లను రక్షించేలా ఇలా చేయించుకుంటే చోరీలను అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో లైన్​ ఇన్​స్పెక్టర్​ శీను, లైన్​మన్​ షేరు తదితరులున్నారు.