Rythu Bharosa Delay | రైతు భరోసా లేనట్లేనా.. ఆందోళనలో అన్నదాతలు

యాసంగి సీజన్​కు సంబంధించి రైతు భరోసాను ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa Delay | రాష్ట్ర ప్రభుత్వం (State Government) యాసంగి సీజన్​కు సంబంధించిన రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మంత్రివర్గ సమావేశంలో నిధుల విడుదలపై చర్చిస్తారని వార్తలు వచ్చినా.. దాని ఊసే ఎత్తలేదు. దీంతో ఈ సీజన్​లో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేస్తుందో లేదోనని రైతులు (Farmers) ఆందోళన వ్యక్తం చేశారు.

బీఆర్​ఎస్ (BRS) హయాంలో రైతుబంధు పథకం ప్రవేశ పెట్టారు. పంట పెట్టుబడి సాయం కింద మొదట ఎకరానికి రూ.4 వేలు ఇచ్చేవారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరాకు ప్రతి సీజన్​లో రూ.6 వేలు అందిస్తామని ప్రకటించింది. అయితే యాసంగి సీజన్​కు సంబంధించిన డబ్బులు డిసెంబర్​లో వేయాలి. కానీ ఫిబ్రవరి ముగుస్తున్నా రైతు భరోసా జమ చేయకపోవడం, అసలు నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ సారి ఎగ్గొడుతుందని రైతులు చర్చించుకుంటున్నారు.

Rythu Bharosa Delay | స్పందన కరువు

క్యాబినెట్ మీటింగ్‌ (Cabinet Meeting)లో రైతు భరోసాపై ఎలాంటి చర్చ జరగలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీటింగ్​కు హాజరు కాలేదు. నవంబర్​, డిసెంబర్​లో యాసంగి సీజన్​ పనులు ప్రారంభం అవుతాయి. సగం సీజన్​ గడిచినా రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

Rythu Bharosa Delay | గతంలో సైతం

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక తొలిసారి రైతు బంధు కింద ఎకరాకు రూ.5 వేలు జమ చేశారు. అనంతరం ఒక సీజన్​లో రైతు భరోసా జమ చేయలేదు. మరో సీజన్​లో నాలుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే నిధులు విడుదల చేశారు. గత వానాకాలం సీజన్​లో మాత్రమే అందరు రైతులకు నిధులు విడుదల చేశారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే ఆ సమయంలో స్థానిక ఎన్నికలు (Local Elections) పెట్టాలని ప్రభుత్వం ఆలోచించింది. దీంతోనే నిధులు విడుదల చేసినట్లు విమర్శలు వచ్చాయి.

సాగు భూములకు మాత్రమే రైతు భరోసా వేస్తామని మంత్రి తుమ్మల (Minister Tummala) గతంలో ప్రకటించారు. సంక్రాంతి తర్వాత సర్వే పూర్తి చేసి నిధులు విడుదల చేస్తామన్నారు. మున్సిపల్​ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. అయితే ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. మొత్తం రైతులకు రైతు భరోసా విడుదల చేయాలంటే రూ.9 వేల కోట్లు అవసరం. దీంతో ఈ సీజన్​లో రైతు భరోసా వేయకుండా తప్పించుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Related articles

Harish Rao Demands Halt | పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలి : హరీశ్​రావు

ఖమ్మం జిల్లా వినోబానగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు.

Inter Exams 2026 | రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్​ పరీక్షలు.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

అక్షరటుడే, కమ్మర్​పల్లి : Inter Exams 2026 | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్​ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధిత అధికారులు ఆయా...

Hyderabad Cyber Crime Arrests | 104 మంది సైబర్​ నేరగాళ్ల అరెస్ట్​.. నిందితుల్లో బ్యాంకు ఉద్యోగులు

హైదరాబాద్ సైబర్​ క్రైమ్​​ పోలీసులు భారీ ఆపరేషన్​ చేపట్టారు. 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Influencer Labor Controversy | భార్య ప్రసవ వేదనను వీడియోగా.. మధ్యలో యాడ్ ప్రమోషన్ .. పిచ్చి పీక్స్‌కి చేరిందేంటి..!

సియాటెల్‌లో నివసిస్తున్న చైనాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ ‘పాల్ ఇన్ యూఎస్ఏ’ తన భార్య 23 గంటల ప్రసవ వేదనను వీడియోగా పోస్ట్ చేసి, అదే వీడియోలో పెయిడ్ యాడ్ చదివిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రజాగ్రహం మధ్య డౌయిన్, వీబో అతడి ఖాతాలను నిషేధించాయి.