ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | మూడు ఎకరాల్లోపు అన్నదాతలకు రైతు భరోసా జమ

    Rythu Bharosa | మూడు ఎకరాల్లోపు అన్నదాతలకు రైతు భరోసా జమ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | ప్రభుత్వం వానాకాలం సీజన్​కు సంబంధించి రైతు భరోసా (Rythu Bharosa)ను వేగంగా జమ చేస్తోంది. సోమవారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) రైతు భరోసా పథకానికి నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలిరోజు రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,349 కోట్లు జమ చేసింది. రెండో రోజు మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది.

    ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మంగళవారం మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు ఖాతాల్లో నగదు జమ అయింది. 10.45 లక్షల రైతుల రూ.1,551.89 కోట్లు జమ అయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageshwara Rao) మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుభరోసా జమ చేస్తున్నామని తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

    రాష్ట్రంలో తొమ్మిది రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు రోజుల్లో మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేసింది. బుధవారం నాలుగు ఎకరాల్లో భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉంది. యాసంగి సీజన్​లో నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎకరాలతో సంబంధం లేకుండా అందరికి జమ చేస్తామని తెలిపింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...