అక్షరటుడే, వెబ్డెస్క్ : Russia | రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్పై రష్యా క్షిపణులతో దాడులు చేస్తుండగా.. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్లో దాడులు చేసింది. వందకు పైగా డ్రోన్లతో మాస్కోలోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. దీంతో రష్యా నాలుగు విమానాశ్రయాలను మూసివేసింది. ఉక్రెయిన్ డ్రోన్లను తాము కూల్చి వేసినట్లు రష్యన్ అధికారులు ప్రకటించారు. ఎయిర్పోర్టులే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. దీంతో పలు విమానాశ్రయాలు ధ్వంసం అయినట్లు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంపై రష్యా దళాలు 20కి పైగా డ్రోన్లను ప్రయోగించాయి. రష్యా విక్టరీ డే సందర్భంగా మే 8 నుంచి 10 వరకు యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించనున్నారు.
