Homeజిల్లాలునిజామాబాద్​Transport Department | స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీవో అధికారులు

Transport Department | స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీవో అధికారులు

నిబంధనలు పాటించని స్కూల్​ బస్సులపై అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. బోధన్​ పట్టణంలో 12 బస్సులను తనిఖీలు చేసి జరిమానాలు విధించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Transport Department | నిబంధనలు పాటించని స్కూల్​ బస్సులపై అధికారులు వరస దాడులు చేస్తున్నారు. ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ (Transport Commissioner) ఆదేశాల మేరకు బోధన్​ పట్టణంలో పలు స్కూల్​ బస్సులను ఆర్టీఏ అధికారులు, ఆర్డీవో శ్రీనివాస్​ (RDO Srinivas) ఆధ్వర్యంలో తనిఖీ చేశారు.

ఈ మేరకు శుక్రవారం ఉదయం బోధన్ (Bodhan) పట్టణంలో 12 స్కూల్ బస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని మూడు బస్సులకు రూ.47వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ (Traffic CI Chander Rathod) తదితరులు పాల్గొన్నారు.