ePaper
More
    Homeక్రైంRTC bus | ఆర్టీసీ బస్సు ఢీ: తాత మనవడి దుర్మరణం

    RTC bus | ఆర్టీసీ బస్సు ఢీ: తాత మనవడి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: RTC bus | టీవీఎస్​ ఎక్సెస్​ను(TVS XL) ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొనడంతో తాతా మనవడు మృతి చెందిన ఘటన రాజంపేట (Rajampet) మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బస్వన్నపల్లి గ్రామానికి చెందిన దోమకొండ నడిపి రాములు(50) తన మనవడు శ్రీహాన్స్(4)కు కుక్క కరవడంతో రాజంపేట పీహెచ్​సీకి టీవీఎస్ ఎక్సెస్​పై వెళ్లారు.

    పీహెచ్​సీలో వైద్యుల పరీక్షల నిమిత్తం తిరిగి వెళ్తుండగా.. రాజంపేట వైపు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్సెస్​ వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు కింద ఎక్సెల్ వాహనం ఇరుక్కుపోవడంతో తాత మనవడు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు టైరు కింద రాములు ఇరుక్కుపోగా మనవడు శ్రీహన్స్ పక్కకు ఎగిరిపడ్డాడు. బస్సు కింద ఇరుక్కున్న వాహనాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు. సమాచారం తెలియడంతో గ్రామస్తులు పెద్దఎత్తున రాజాంపేటకు చేరుకున్నారు. తాత మనవడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

    More like this

    Nepal | నేపాల్‌లో భ‌యాన‌క దృశ్యాలు.. తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం, రాజకీయ అవినీతి,...

     AP Government | ఏపీలో 60ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. ద‌ర‌ఖాస్తు ఫీజు కూడా లేద‌ట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) సీనియర్ సిటిజన్ల కోసం జారీ చేసే...

    Stock Market | స్తబ్దుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...