Homeజిల్లాలునిజామాబాద్​Travels Buses | ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

Travels Buses | ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

కర్నూలులో బస్సు తగలబడిపోయిన ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులను తనిఖీలు చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే ఇందల్వాయి: Travels Buses | కర్నూలు (Kurnool) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్​ బస్సుకు నిప్పంటుకుని 20 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ట్రావెల్స్​ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు.

Travels Buses | ఇందల్వాయి టోల్​ప్లాజా వద్ద..

ఇందల్వాయి టోల్​ప్లాజా (Indalwai Toll Plaza) వద్ద శనివారం ఆర్టీఏ అధికారులు (RTA Nizamabad) ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు, ఫిట్​నెస్​ ఉండాలని అధికారులు సూచించారు. ఫిట్​నెస్​ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే కఠినచర్యలు తప్పవని వారు హెచ్చరించారు. వాహనాల తనిఖీల్లో మోటార్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్లు పవన్​ కళ్యాణ్​, శృతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News