Homeజిల్లాలునిజామాబాద్​RSS Indur | నగరంలో ఆర్ఎస్ఎస్ మహా పథ సంచలన్

RSS Indur | నగరంలో ఆర్ఎస్ఎస్ మహా పథ సంచలన్

నగరంలో ఆర్​ఎస్​ఎస్​ ఆధ్వర్యంలో నగర మహా పథ సంచలన్​ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ధన్​పాల్​, బీజేపీ కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే యెండల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: RSS Indur | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh)​ ఇందూరు నగర మహా పథ సంచలన్​ను (RSS Path sanchalan) ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో ఉన్న హెచ్​పీఎస్​ పాఠశాల నుంచి కార్యక్రమం ప్రారంభమైంది.

కాషాయ ధ్వజానికి ప్రణామం చేసిన అనంతరం చంద్రశేఖర్ కాలనీ(Chandrasekhar Colony) కంఠేశ్వర్ రోడ్ (కంఠేశ్వర్) ఉమెన్స్ కాలేజ్ మీదుగా తిరిగి హెచ్​పీఎస్​ పాఠశాలకు చేరుకుంది. పథ సంచలన్​లో చిన్నారులు అమితంగా ఆకట్టుకున్నారు.

ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యవక్తగా విచ్చేసిన ఇందూర్ విభాగ ప్రచారక్ శివకుమార్ మాట్లాడుతూ సంఘం గత వందేళ్లుగా దేశంలో హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తోందన్నారు. సమాజంలో చైతన్యాన్ని నింపి ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలవడానికి ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు.

RSS Indur | నవంబర్​లో జన జాగరణ

అందులో భాగంగా నవంబర్ మాసంలో ఇంటింటికి జన జాగరణ పేరుతో వెళ్లి సంఘ శతాబ్ది సందేశాన్ని పంచ పరివర్తన ద్వారా అందజేస్తారని పేర్కొన్నారు. బాలలు సైతం శ్రమకోచ్చి 3 కి.మీ సంచలన్​లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ ప్రచారక్​తో పాటు జిల్లా సంఘచాలకులు డాక్టర్ కాపర్తి గురుచరణం, నగర కార్యవాహ అర్గుల సత్యం, విభాగ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్, ఉప కార్యవాహ వెంకటేష్, సుమిత్, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal), మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News