Homeజిల్లాలుకామారెడ్డిRSS | విపత్కర పరిస్థితుల్లో అండగా ఆర్​ఎస్​ఎస్​

RSS | విపత్కర పరిస్థితుల్లో అండగా ఆర్​ఎస్​ఎస్​

అక్షరటుడే, గాంధారి: RSS | దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh)​​ ప్రజలకు అండగా నిలిచిందని ఇందూరు విభాగ్ (Indur Vibhag​)​ ఘోష్​ ప్రముఖ్​ నాగభూషణం అన్నారు. మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్​లో సోమవారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి కార్యక్రమం నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా ఆర్ఎస్ఎస్ (Kamareddy RSS) సహ కార్యవాహ రెడ్డి సాయిలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వయం సేవక్​ తాటి దర్శన్ గుప్తా, నాగభూషణం విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 122 మంది స్వయం సేవకులు గణవేష్ ధరించడం సంతోషంగా ఉందన్నారు.

సమాజంలో ప్రస్తుతం పంచ పరివర్తన్ (Pancha Parivartan)​ ఆవశ్యకతను గురించి తెలసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై 2025 వరకు 100 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఏవిధంగా ముందుకెళ్లింది.. అత్యవసర పరిస్థితుల్లో దేశం కోసం ఎలా పోరాడిందనే విషయాలను వారు వివరించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ స్థాపకులు డాక్టర్ హెగ్డేవార్​ అనేక సవాలను ఎదుర్కొని సంఘాన్ని స్థాపించారన్నారు. ఆర్​ఎస్​ఎస్​ను మాధవ సదాశివ గోల్వాల్కర్ పటిష్టమైన పునాదులు వేసి ఆర్​ఎస్​ఎస్​ను నిలబెట్టారని వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Must Read
Related News