అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కమ్మర్పల్లి (Kammarpally) శాఖ ఆధ్వర్యంలో శనివారం పథ సంచలన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 200 మందికిపైగా స్వయం సేవకులు పాల్గొన్నారు.
సంఘం ప్రారంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. హిందువుల ఐక్యత కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మరియాల నాగభూషణం, ఉట్నూర్ రాజశేఖర్, పేట గంగారెడ్డి, రుద్ర మధుసూదన్, పసుపుల వినీత్, రవిచంద్ర వర్మ, భోగ రామస్వామి, గుండోజీ శ్రీకాంత్, బోండ్ల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.