terror attack victims | ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం, సర్కారు కొలువు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: terror attack victims : మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్​ ఉగ్రదాడిలో మరణించిన మహారాష్ట్ర పౌరులకు ఆ రాష్ట్ర సర్కారు పరిహారం ప్రకటించింది. ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. దీంతోపాటు వారి కుటుంబాల్లో ఒకరికి సర్కారు కొలువు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర కేబినెట్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్​ పహల్గావ్​లో మినీ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: terror attack victims : మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్​ ఉగ్రదాడిలో మరణించిన మహారాష్ట్ర పౌరులకు ఆ రాష్ట్ర సర్కారు పరిహారం ప్రకటించింది. ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. దీంతోపాటు వారి కుటుంబాల్లో ఒకరికి సర్కారు కొలువు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర కేబినెట్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్​ పహల్గావ్​లో మినీ స్విట్జర్లాండ్​గా పిలిచే బైసరన్​ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు మరణించారు. వీరిలో అత్యధికంగా (ఆరుగురు) మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు ఉన్నారు. ముంబయికి చెందిన హేమంత్ జోషి సుహాస్‌, దిలీప్‌ దేసాలే, థానేకు చెందిన సంజయ్‌ లక్ష్మణ్ లేలే, అతుల్‌ శ్రీకాంత్ మోని, పుణెకు చెందిన కస్టోబే గనోవోటే, సంతోష్‌ జగ్దాలే ఉగ్రదాడిలో మరణించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్​లో కూడా డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్ ఈ విషయంలో స్​ ఆ రాష్ట్ర మృతులకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Adulterated Milk Deaths Rajahmundry | కల్తీపాల ఘటన.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కల్తీ పాలతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

Chickpea Crop Damage | శనగపంటకు వరుణ గండం.. ఆందోళనలో రైతులు..

అకాల వర్షాలు శనగ పంట రైతుల్లో గుబులు రేపుతున్నాయి. జిల్లాలో ఉదయం జిల్లాలో వర్షం కురియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.