HomeUncategorizedTirumala Dairy | రూ.40 కోట్ల మోసం.. తిరుమల డెయిరీ మేనేజర్​ ఆత్మహత్య

Tirumala Dairy | రూ.40 కోట్ల మోసం.. తిరుమల డెయిరీ మేనేజర్​ ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala Dairy | చెన్నై(Chennai)లోని తిరుమల డెయిరీ మేనేజర్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోకి విశాఖపట్నంకు చెందిన నవీన్‌ బొల్లినేని(37) చెన్నై మాధవరంలోని తిరుమల డెయిరీ(Tirumala Dairy)లో ట్రెజరీ మేనేజరుగా పని చేస్తున్నాడు. అయితే కంపెనీలో ఇటీవల రూ.40 కోట్ల మోసం జరిగింది. మనీ లాండరింగ్(Money Laundering)​ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నవీన్​కు నోటీసులు అందించారు.

Tirumala Dairy | ఈ మెయిల్​ పంపి..

కంపెనీ లెక్కల్లో నవీన్​ రూ.40 కోట్లు మోసానికి(Rs. 40 Crore Fraud) పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాను డబ్బు తిరిగి ఇస్తానని నవీన్​ ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే డబ్బులు ఆయన తిరిగి ఇవ్వలేకపోయాడు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు(Police Notice) అందించడంతో నవీన్‌ పుళల్‌ బ్రిటానియానగర్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు నవీన్​ తన సోదరికి ఈ మెయిల్​ పంపాడు. దీంతో కుటుంబ సబ్యులు వచ్చి చూసే సరికే నవీన్​ మృతి చెందాడు. తనను కొంతమంది అధికారులు బెదిరిస్తున్నారని ఈ మెయిల్​లో ఉన్నట్లు సమాచారం.