ACB Trap | రూ.2.5 లక్షల లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో, ఎంపీవో

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Trap | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇంటి నిర్మాణానికి లంచం అడిగిని ముగ్గురు అధికారులను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా (Rangareddy district) నందిగామ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు (ACB officials) బుధవారం సోదాలు చేశారు. ఓ వ్యక్తి నాలుగు ప్లాట్లలో ఇంటి నిర్మాణం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత రుసుము కూడా చెల్లించాడు. అయితే ఆ దరఖాస్తును ప్రాసెస్​ చేసి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Trap | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇంటి నిర్మాణానికి లంచం అడిగిని ముగ్గురు అధికారులను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

రంగారెడ్డి జిల్లా (Rangareddy district) నందిగామ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు (ACB officials) బుధవారం సోదాలు చేశారు. ఓ వ్యక్తి నాలుగు ప్లాట్లలో ఇంటి నిర్మాణం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత రుసుము కూడా చెల్లించాడు. అయితే ఆ దరఖాస్తును ప్రాసెస్​ చేసి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి ఎంపీడీవో సుమతి, ఎంపీవో తేజ్​సింగ్​, పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య లంచం డిమాండ్​ చేశారు.

ACB Trap | రూ.లక్ష తీసుకుంటుండగా..

బాధితుడి నుంచి వారు రూ.2.5 లక్షలు డిమాండ్​ చేశారు. దీంతో ఆయన ఏసీబీ అధికారులకు (ACB officials) ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బుధవారం లంచం తీసుకుంటుండగా.. ఎంపీడీవో పొన్న సుమతి, మండల పంచాయతీ అధికారి వడ్త్యావత్ తేజ్ సింగ్, ఎదులపల్లి పంచాయతీ కార్యదర్శి ఆవుల చెన్నయ్యను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. నిందితులను అరెస్ట్​ చేశారు.

Related articles

BJP district president Dinesh | దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. బీజేపీ డిమాండ్​

అమాయకులపై దాడులకు పాల్పడిన ముష్కరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు. ఈ మేరకు డీజీపీ శివధర్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అధికారులను సూచించారు. ఈ మేరకు కందకుర్తి పుష్కర ఘాట్​ను ఆమె బుధవారం సందర్శించారు.

Assistant Professors Terminated | మెడికల్ కళాశాలలో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ

నగరంలోని మెడికల్ కళాశాలలో ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వైద్యవిధాన పరిషత్​ కొరడా ఝలిపించింది. ఈ సందర్భంగా ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

Basara IIIT Student | బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara IIIT Student | నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్​ ఐటీ (IIIT)లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్​...