ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNational Lok Adalat | మృతుడి కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం

    National Lok Adalat | మృతుడి కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: National Lok Adalat | రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రూ.1.40కోట్ల పరిహారం అందించారు. ఈ మేరకు శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో (National Lok Adalat) జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్‌ (District Chief Judge Varaprasad) కేసును పరిష్కరించారు.

    వివరాల్లోకి వెళ్తే.. తల్లపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌ బైక్‌పై వెళ్తూ తాడ్వాయి (Tadwai) సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు ఇన్సూరెన్స్‌ కంపెనీకి పరిహారం కోసం క్లెయిమ్‌ చేయగా, వివాదం నడిచింది. దీంతో వారు ఇన్సూరెన్స్‌ కంపెనీ సహా ప్రతివాదులపై కోర్టులో క్లెయిమ్‌ దాఖలు చేశారు. శనివారం లోక్‌ అదాలత్‌లో ఈ కేసు రాజీ కుదిరింది. మృతుడి కుటుంబానికి ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మంజూరైన రూ.1.40 కోట్ల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...