అక్షరటుడే, వెబ్డెస్క్: RRB Jobs | పదో తరగతి, ఐటీఐ అర్హతలతో రైల్వేలో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నవారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) తీపి కబురు అందించింది. 22 వేల గ్రూప్-డి (లెవల్-1) పోస్టులను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాయింట్స్మన్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ (Notifications) వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : సుమారు 22 వేలు.
భర్తీ చేసే పోస్టుల వివరాలు : లెవల్-1 గ్రూప్-డి.
ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్మన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ లోకో షెడ్(ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఆపరేషన్స్, ట్రాక్ మెషిన్ అసిస్టెంట్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.
భర్తీ చేసే ఆర్ఆర్బీ రీజియన్లు : సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్, అజ్మేర్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, గోరఖ్పుర్, కోల్కతా, మాల్దా, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ.
విద్యార్హత : పదో తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత. 10వ తరగతితో పాటు ఎన్సీవీటీ ద్వారా మంజూరైన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
టెక్నికల్ పోస్టులు : లెవల్-1 పోస్టుల కోసం (ప్రత్యేకంగా సూచించిన చోట) ఐటీఐ పూర్తి చేసిన వారు లేదా కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్లకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి : ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్యవయసువారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతన వివరాలు :
వేతనం: బేసిక్ పే నెలకు రూ. 18 వేల నుంచి ప్రారంభమవుతుంది (ఇతర అలవెన్సులు అదనం).
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా..
దరఖాస్తుల ప్రారంభ తేదీ : జనవరి 31.
దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 2.
ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్తోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాల కోసం https://www.rrbapply.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.