Homeజిల్లాలుకామారెడ్డిNH 44 | హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

NH 44 | హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 |  హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. తన ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దగ్గి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. డిచ్​పల్లి మండలం రాంపూర్​ గ్రామానికి చెందిన మంజూర్​ హుస్సేన్​(47) వృత్తిరీత్యా మార్కెటింగ్​ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా.. అతను శనివారం తెల్లవారు జామున బైకుపై 44వ నంబర్​ జాతీయ రహదారిపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో దగ్గి సమీపంలో ప్రమాదవశాత్తు ముందువెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా కేంద్ర జనరల్ ఆస్పత్రికి తరలించారు. సదాశివనగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News