London | లండన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : London | లండన్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​కు (Hyderabad) చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు (Telugu states) చెందిన పలువురు యువకులు లండన్​లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. సోమవారం నిమజ్జనం కోసం రెండు కార్లలో వెళ్లారు. తిరిగి వస్తుండగా వారి కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను నాదర్​గుల్​కు చెందిన తర్రె చైతన్య (23), […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : London | లండన్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​కు (Hyderabad) చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాలకు (Telugu states) చెందిన పలువురు యువకులు లండన్​లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. సోమవారం నిమజ్జనం కోసం రెండు కార్లలో వెళ్లారు. తిరిగి వస్తుండగా వారి కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను నాదర్​గుల్​కు చెందిన తర్రె చైతన్య (23), ఉప్పల్‌కు (Uppal) చెందిన రిషితేజ(21)గా గుర్తించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

London | ఉన్నత చదువుల కోసం..

నాదర్​గుల్​కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు చైతన్య బీటెక్​ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 8 నెలల క్రితం లండన్​ (London) వెళ్లాడు. తమ కొడుకు విదేశాల్లో చదువుకొని తిరిగి వస్తాడని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారి కుమారుడిని బలి తీసుకుంది.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...