HomeతెలంగాణAmerica | అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనం

America | అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనం

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్ : America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన కుటుంబం సజీవ దహనం అయింది. ఒళ్లు గగొర్పొడిచే ఈ ఘటన గ్రీన్‌కౌంటీ (Green County) ఏరియాలో చోటు చేసుకుంది. కారును భారీ ట్రక్కు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

America : అట్లాంటా నుంచి డల్లాస్​ వెళ్తుండగా..

ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా వెంకట్, తేజస్విని దంపతులు మృతి చెందారు. వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని నలుగురు కూడా సజీవ దహనం అయ్యారు. అట్లాంటా (Atlanta) నుంచి డల్లాస్‌(Dallas) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

America : మొత్తం బూడిదగా మారి..

బాధిత కుటుంబం డల్లాస్​లో నివసిస్తున్నట్లు సమాచారం. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలు మాత్రమే మిగిలాయి. దీంతో వాటి ఆనవాళ్లను పోలీసులు ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు. మృతదేహాల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. తదుపరి మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్​లోని వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆహ్లాదంగా విహారానికి వెళ్లి, బంధువులతో సరదాగా గడిపి.. తిరిగి వెళ్తుండగా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది.