అక్షరటుడే, మెండోరా : SRSP | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్కు (Sriram Sagar Project) ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలో క్రమక్రమంతో వరద పెరుగుతోంది. దీంతో అధికారులు మంగళవారం ఉదయం 8 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
SRSP | ప్రాజెక్టులోకి..
ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 34,654 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు అంతే మొత్తంలో క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు (Kakatiya Canal) 3 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు200 క్యూసెక్కులు వదులుతున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1091.00 అడుగుల (80.501 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
SRSP | దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
గోదావరి (Godavari) పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, జాలర్లు, రైతులు, ప్రయాణికులు గోదావరిని దాటే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎఫ్ఎఫ్సీ అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
