అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar Project | జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజాంసాగర్కు వరద పోటెత్తుతోంది. అలాగే ఎగువన సింగూరు, పోచారం ప్రాజెక్ట్ల (Pocharam projects) నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 19 గేట్ల ద్వారా 1,39,336 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి వదులుతున్నారు.
Nizamsagar Project | కొనసాగుతున్న వరద..
నిజాంసాగర్ ప్రాజెక్ట్కు వరద కొనసాగుతోంది. జలాశయంలోకి ఎగువ నుంచి 1,30,097 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 1405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1401.61 అడుగుల (13.123 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఆయకట్టు కోసం ప్రధాన కాలువకు 900 క్యూసెక్కులు వదులుతున్నారు.
Nizamsagar Project | సింగూరు నుంచి..
నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన గల సింగూరు ప్రాజెక్టుకు (Singuru) వరద కొనసాగుతుండడంతో గేట్లను ఎత్తి 96,604 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 90,000 ఇన్ఫ్లో వస్తుండడంతో దిగువకు వదులుతున్నారు.