అక్షరటుడే, నిజాంసాగర్: Heavy Rains | జుక్కల్ నియోజవర్గాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జిల్లాలో పలుచోట్ల వరదలో పలువురు చిక్కుకున్నారు.
ఎల్లారెడ్డి మండలంలో బొగ్గు గుడిసె వద్ద వరదలో పలువురు చిక్కుకున్నారు. బొగ్గు గుడిసె (Boggu gudise) వద్ద జాతీయ రహదారి పనుల్లో భాగంగా పనిచేస్తున్న కార్మికులు వరదలో బుధవారం ఉదయం చిక్కుకున్నారు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సిబ్బందిని రక్షించారు.
Heavy Rains | తక్షణమే స్పందించిన జిల్లా యంత్రాంగం
ఎల్లారెడ్డి మండలంలోని బొగ్గు గుడిసె వద్ద వరదలో సుమారు 8 మంది చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub collector Kiranmai) తక్షణమే స్పందించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. వర్షంలోనే దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. చివరకు ఎస్డీఆర్ఎఫ్ (SDRF) సిబ్బంది బోట్లను తీసుకెళ్లి వరదలో చిక్కుకున్న ఎనిమిది మంది బాధితులను అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు.
పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి
Heavy Rains | మహమ్మద్నగర్ మండలంలోని కోళ్లఫాంలో..
లింగంపేట (Lingampet) చెరువులు తెగిపోయి వరద ఒక్కసారిగా దిగువకు వచ్చేసింది. దీంట్లో భాగంగా మహమ్మద్నగర్ మండలంలోని గున్కుల్ (Gonkal village) గ్రామంలోని ఓ కోళ్ల ఫాంలో నలుగురు చిక్కుకున్నారు. వరద భారీగా రావడంతో అక్కడే ఓ షెడ్డుపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కూర్చుకున్నారు. వారిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. ఈ విషయాన్ని పలువురు సమాచారాన్ని వెంటనే సబ్కలెక్టర్ కిరణ్మయికి చేరవేశారు. తక్షణమే స్పందించిన ఆమె ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని సైతం సురక్షితంగా వరద ముప్పు నుంచి బయటకు తీసుకొచ్చారు.
Heavy Rains | కామారెడ్డిలో భారీవర్షం.. అతలాకుతలం..
అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డిలో భారీవర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. బుధవారం ఉదయం నుంచి తుఫానుతో కూడిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హౌసింగ్ బోర్డు కాలనీలో (Housing Board Colony) వరదలో చిక్కుకున్న ఓ మహిళ, బాలుడిని పోలీసులు అతికష్టంమీద బయటకు తీసుకొచ్చారు. స్వయంగా సీఐ నరహరి (CI Narahari) రంగంలోకి దిగారు. బోరున వర్షం కురుస్తుండగా మహిళను, బాలుడిని రక్షించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
కామారెడ్డి పట్టణంలో హౌసింగ్బోర్డులో వరద బాధితులను బయటకు తీసుకొస్తున్న పట్టణ సీఐ నరహరి, పోలీసులు