Homeజిల్లాలునిజామాబాద్​Bhupathi Reddy | నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గానికి నిధులివ్వాలని మంత్రికి వినతి

Bhupathi Reddy | నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గానికి నిధులివ్వాలని మంత్రికి వినతి

సీఆర్​ఆర్​ 2025‌‌‌‌–2026 నుంచి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కోరారు. జిల్లాకు వచ్చిన ఇన్​ఛార్జి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Bhupathi Reddy | సీఆర్​ఆర్​ 2025‌‌‌‌–2026 నుంచి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy) జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్కను (Minister Seethakka) కోరారు. నియోజకవర్గంలో 170 పంచాయతీలు, ఏడు మండలాలు ఉన్నాయన్నారు.

గ్రామాలకు బీటీ రోడ్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన వివరించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. దీనికి సంబంధించి సీఆర్ఆర్​ నిధులు (CRR funds) మంజూరు చేయాలని మంత్రిని కోరారు. రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల అంచనా వ్యయంతో కూడిన పనులకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.