HomeUncategorizedNational Security Advisory Board | కేంద్రం కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు...

National Security Advisory Board | కేంద్రం కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్​ వ్యవస్థీకరణ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: National Security Advisory Board | పహల్​గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​ – పాక్​ ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం union government of India కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా NSA బోర్డు పునర్​ వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టింది.

ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఛైర్మన్​గా రాRaw మాజీ చీఫ్​ అలోక్​ జోషిని నియమించింది. అంతేకాకుండా సభ్యులుగా పీఎం సిన్హా, ఏకే సింగ్​, మోంటీ కన్నా, మాజీ ఐపీఎస్​లు రాజీవ్​ రంజన్​ వర్మ, మన్మోహన్​ సింగ్​, మాజీ ఐఎఫ్​ఎస్​ అధికారి వెంకటేశ్​ వర్మ తదితరులను నియమించింది. బోర్డు సభ్యులుగా మాజీ మిలిటరీ ఐపీఎస్​, ఐఎఫ్​ఎస్​ అధికారులు ఉన్నారు.

పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కేంద్రం ఈ బోర్డును ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. కేంద్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కాసేపట్లో ఈ విషయాలను కేంద్ర మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు.