HomeతెలంగాణHyderabad | టీవీ, ఇంటర్​నెట్ వైర్ల తొలగింపు.. ​నిలిచిపోయిన సేవలు

Hyderabad | టీవీ, ఇంటర్​నెట్ వైర్ల తొలగింపు.. ​నిలిచిపోయిన సేవలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఏ వీధిలో చూసినా విద్యుత్​ స్తంభాలకు కేబుల్​ వైర్లు కనిపిస్తాయి. ఇంటర్​ నెట్​, టీవీ కేబుల్​ వైర్ల (TV Cable Wires) చుట్టలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉంటాయి. దీంతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

నగరంలోని రామాంతపూర్​లో ఇటీవల శ్రీకృష్ణుడి రథాన్ని (Lord Krishna Chariot) లాగుతుండగా.. విద్యుత్​ షాక్​తో ఆరుగురు మృతి చెందారు. విద్యుత్​ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లతో ప్రమాదం జరిగినట్లు విద్యుత్​ శాఖ అధికారులు (Electricity Department Officers) తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో అనుమతి లేకుండా విద్యుత్​ స్తంభాలకు ఏర్పాటు చేసిన కేబుల్​ వైర్లను తొలగించాలని ఆయన ఆదేశించారు.

Hyderabad | వరుస ఘటనలతో అప్రమత్తం

రామాంతపూర్ (Ramantapur)​ ఆరుగురు మృతి చెందిన విషయం మరువక ముందే బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti Vikramarka) విద్యుత్​ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యుత్​ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుళ్లను తొలగించాలని ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వైర్ల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో విద్యుత్​ అధికారులు అనుమతులు లేకుండా స్తంభాలపై ఏర్పాటు చేసిన టీవీ, ఇంటర్​ నెట్​ కేబుళ్లను తొలగిస్తున్నారు.

Hyderabad | సేవలు అందక ఆందోళన

ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను అధికారులు తొలగిస్తున్నారు. అయితే ఒక్కసారిగా వైర్లను కట్​ చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో టీవీలు రావడం లేదు. ఇంటర్​ నెట్​ సేవలు (Internet Services) నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. నెట్​ లేకపోతే చాలా మంది ఇబ్బంది పడతారని, ఇలా ఒక్కసారిగా కేబుళ్లు కట్​ చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.