అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందేవారికి సీఎం రిలీఫ్ఫండ్ ఎంతో ఉపశమనం ఇస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు. బుధవారం నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో పలువురికి రూ.12లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, అర్హులైనవారికి ఇందిరమ్మఇళ్లు (Indiramma House), కొత్త రేషన్కార్డులు (New Ration Cards) అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగాధర్, రత్నాకర్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.
