అక్షరటుడే, వెబ్డెస్క్ :OMC Case | అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో గాలి జనార్దన్రెడ్డికి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(ఓఎంసీ)లో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డికి సీబీఐ కోర్టు(CBI Court) జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆయన దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. పాస్పోర్ట్ సరెండర్ చేయడంతో పాటు రూ.10 లక్షల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.అక్రమ మైనింగ్ కేసులో జనార్దన్రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను సస్పెండ్ చేయాలంటూ ఆయన హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు.
దీనిపై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. బుధవారం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసింది.
