అక్షరటుడే, ఆర్మూర్: Ankapoor | అంకాపూర్లో అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు (double bedroom houses) కేటాయించాలని కోరుతూ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలను తాత్కాలికంగా విరమించారు. సీపీఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో నాలుగురోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం దీక్షా శిబిరం నుంచి ఆర్మూర్ (Armoor) అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ నిజామాబాద్, కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి.ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి బి.దేవారం మాట్లాడుతూ.. తాత్కాలికంగా దీక్ష విరమించినట్లు తెలిపారు. రేపటి నుంచి కలెక్టర్, మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి బి.కిషన్, పార్టీ జిల్లా నాయకురాలు సత్యక్క, కిషన్, నాయకులు ఠాగూర్ మచ్చర్ల రాజన్న ఆకుల గంగన్న, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ అనిల్, అంకాపూర్ ప్రజలు పాల్గొన్నారు.
