అక్షరటుడే, నిజాంసాగర్: rehabilitation center | నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ మండలం మర్పల్లి గ్రామంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (Jukkal MLA Thota Lakshmi Kantarao) వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆదేశించారు.
rehabilitation center | హుటాహుటిన బయలుదేరి..
బీహార్ Bihar లో జరుగుతున్న ఓటరు అధికార యాత్ర (voter empowerment tour) లో ఉన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన పర్యటనను విరమించుకొని హుటాహుటిన బయలుదేరి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చేరుకున్నారు. స్థానికంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు.
rehabilitation center | తాత్కాలిక పునరావాస కేంద్రం..
గోర్గల్లోని సొసైటీ ఫంక్షన్ హాల్ను తాత్కాలిక పునరావాస కేంద్రంగా ఏర్పాట్లు చేశారు. అందులోకి బాధిత గ్రామ ప్రజలను తరలించారు. వృద్ధులకు, పిల్లలకు, మహిళలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
బాధితుల దగ్గరికి ఎమ్మెల్యే వెళ్లి వారి పరిస్థితి, ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అక్కడే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రజలకు కావలసిన వైద్య సేవలు అందిస్తున్నారు. పునరావాస కేంద్రంలో ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటామన్నారు.
ప్రభుత్వం నుంచి బాధితులకు సహాయం అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భరోసా ఇచ్చారు. నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి, లింగంపల్లి గ్రామాలకు వెళ్లి ప్రజలను కలిసి అక్కడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఏదైనా అవసరం అయితే తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar project) ను పరిశీలించారు.
ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో.. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్బంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.