Homeజిల్లాలునిజామాబాద్​Irrigation projects | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న వరద

Irrigation projects | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న వరద

శ్రీరాంసాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. దీంతో అప్రమత్తంగా ఉంటున్న అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి : Irrigation projects | శ్రీరాంసాగర్​ (Sriram Sagar Project), నిజాంసాగర్​ (Nizam Sagar) ప్రాజెక్ట్​లకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

Irrigation projects | ఎస్సారెస్పీలో..

ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్​ జలశయానికి (Sriramsagar Reservoir) వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు శనివారం 8 వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ప్రస్తుతం 34,454 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అంతే మొత్తంలో దిగువకు నీటిని వదులుతున్నారు.

ఎస్కేప్​ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ (Saraswati Canal)కు 650 క్యూసెక్కులు, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. కాకతీయ, లక్ష్మీ కాలువలకు ప్రస్తుతం నీటి విడుదలను నిలిపేశారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేస్థాయిలో నీరు నిల్వ ఉంది.

Irrigation projects | నిజాంసాగర్​కు..

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్​ఫ్లో పెరిగింది. జలాశయంలోకి ప్రస్తుతం 9,570 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది.

Must Read
Related News