అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి : Irrigation projects | శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాంసాగర్ (Nizam Sagar) ప్రాజెక్ట్లకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Irrigation projects | ఎస్సారెస్పీలో..
ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ జలశయానికి (Sriramsagar Reservoir) వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు శనివారం 8 వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ప్రస్తుతం 34,454 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అంతే మొత్తంలో దిగువకు నీటిని వదులుతున్నారు.
ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ (Saraswati Canal)కు 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. కాకతీయ, లక్ష్మీ కాలువలకు ప్రస్తుతం నీటి విడుదలను నిలిపేశారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేస్థాయిలో నీరు నిల్వ ఉంది.
Irrigation projects | నిజాంసాగర్కు..
నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్ఫ్లో పెరిగింది. జలాశయంలోకి ప్రస్తుతం 9,570 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది.
