HomeUncategorizedColonel Sophia Qureshi | ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం

Colonel Sophia Qureshi | ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Colonel Sophia Qureshi : ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో కీలకంగా వ్యవహరించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ (Sophia Qureshi) పై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ వ్యవహారంలో ఆ మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను మధ్యప్రదేశ్ హైకోర్టు Madhya Pradesh High Court ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్​ డీజీపీని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం.

మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా Madhya Pradesh Minister Vijay Shah ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ పేరును పరోక్షంగా వివాదాస్పదంగా ప్రస్తావించారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేయగా.. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన ఓ సోదరిని సైనిక విమానంలో మోడీజీ పంపించి గుణపాఠం చెప్పారని అన్నారు.

మంత్రి వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అటు జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women – NCW) సైతం మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు స్త్రీల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.