HomeUncategorizedOdisha | రీల్స్ పిచ్చి పీక్స్​.. రైల్వే ట్రాక్​పై పడుకున్న బాలుడు.. వీడియో వైరల్

Odisha | రీల్స్ పిచ్చి పీక్స్​.. రైల్వే ట్రాక్​పై పడుకున్న బాలుడు.. వీడియో వైరల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ప్రస్తుతం కొంతమంది సోషల్​ మీడియా (Social Media)లో ఫేమస్​ కావడానికి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. రీల్స్​ (Reels) పిచ్చిలో పడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వ్యూస్​, లైక్​ల మత్తులో ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. కొందరు అసభ్యకర వీడియోలు, బూతులతో ఫేమస్​ అవుతుంటే.. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ బాలుడు రీల్స్​ కోసం రైల్వే ట్రాక్​పై పడుకున్నాడు.

ఒడిశా(Odisha)లో ఓ బాలుడు రైల్వే ట్రాక్​ (RaIlway Track)పై పడుకొని రీల్స్​ తీయడం గమనార్హం. రెండు సిమెంట్​ కడ్డీల మధ్య పడుకొని రైలు పోయేంత వరకు కదలకుండా అలాగే పడుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్​పై పడుకున్న బాలుడితోపాటు సహకరించిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏమాత్రం కదిలినా బాలుడి ప్రాణాలు పోయేవి. రీల్స్​, షార్ట్స్​ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Odisha | తల్లిదండ్రులు గమనించాలి

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ ఫోన్​ ఉంది. చాలా మంది రీల్స్​, యూట్యూబ్​ వీడియోలు చూస్తూ టైం పాస్​ చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజీ యువత సోషల్​ మీడియాకు బానిసలుగా మారారు. వీరు ఎలాగైనా ఫేమస్​ కావాలని నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. రీల్స్​ కోసం పిచ్చి చేష్టలు చేస్తే మొదట్లోనే మందలించాలని చెబుతున్నారు. లేదంటే తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే తీరని వేదన మిగులుతుందంటున్నారు.

Read all the Latest News on Aksharatoday.in

Must Read
Related News