ePaper
More
    HomeతెలంగాణHyderabad Metro | తగ్గిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమలులోకి..

    Hyderabad Metro | తగ్గిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమలులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hyderabad Metro | హైదరాబాద్​ మెట్రో(Hyderabad Metro)లో తగ్గిన ఛార్జీలు నేటి(శనివారం) నుంచి అమలులోకి వచ్చాయి.

    కాగా మెట్రోకు నష్టాలు వస్తున్నాయని ఇటీవల ఎల్​ అండ్​ టీ సంస్థ టికెట్​ రేట్ల(Ticket rates)ను పెంచిన విషయం తెలిసిందే. కనిష్ట టికెట్​ ధర రూ.10 నుంచి 12కు గరిష్ట టికెట్​ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచింది. పెంచిన రేట్లు మే 17 నుంచి అమలులోకి వచ్చాయి. అయితే రేట్ల పెంపుపై ప్రయాణికుల(Passenger) నుంచి వ్యతిరేకత రావడంతో మెట్రో వెనక్కి తగ్గింది. పెంచిన రేట్లలో పది శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

    సవరించిన మెట్రో ఛార్జీల(Metro Charges) ప్రకారం కనీస ధర రూ.11, గరిష్ఠ ధర రూ.69 ఉండనుంది. రెండు కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గించారు. 3 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.18 నుంచి రూ.17.. 4 నుంచి 6 కి.మీ వరకు రూ.28.. 6 నుంచి 9 కి.మీ వరకు రూ.37కి రేటు తగ్గించారు.

    9 నుంచి 12 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.50 నుంచి రూ.47కు, 12 నుంచి 15 కి.మీ రూ.55 నుంచి రూ.51రేట్లను తగ్గించారు. 15నుంచి 18 కిలోమీటర్ల రూ.56, 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు రూ.61, 21 నుంచి 24 కి.మీ వరకు రూ.65, 24 కిలోమీటర్లపై ఉంటే రూ.69 మెట్రో ఛార్జి వసూలు చేయనున్నారు. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...