ePaper
More
    HomeతెలంగాణSRSP Inflow | శ్రీరాంసాగర్​కు తగ్గిన ఇన్​ఫ్లో.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల

    SRSP Inflow | శ్రీరాంసాగర్​కు తగ్గిన ఇన్​ఫ్లో.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్ : SRSP Inflow | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాం​సాగర్​ (Sriram Sagar) ప్రాజెక్ట్​కు వరద తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా వర్షాలు పడటం లేదు. దీనికి తోడు మంజీరపై గల నిజాంసాగర్ (Nizam Sagar)​ గేట్లు మూసి వేశారు. దీంతో జలాశయానికి వరద తగ్గింది.

    ఎస్సారెస్పీకి ప్రస్తుతం ఎగువ నుంచి 70 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.90(80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని ప్రాజెక్ట్​ నిండుకుండలా ఉంది. ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతుండటంతో 8 వరద గేట్లను ఎత్తి దిగువకు 24,640 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

    SRSP Inflow | వరద కాలువ ద్వారా..

    శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం నిర్మించిన వరద కాలువ (Flood Canal) ద్వారా 20 వేల క్యూసెక్కులు మిడ్​ మానేరు (Mid Manair)కు తరలిస్తున్నారు. ఎత్తిపోతల ద్వారా మిడ్​ మానేరు నింపితే విద్యుత్​ బిల్లుతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. ఎస్సారెస్పీకి ఇన్​ఫ్లో కొనసాగుతుండటంతో వరద కాలువ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా మిడ్​మానేరు నింపుతున్నారు. దీంతో ప్రాజెక్ట్​ జలకళను సంతరించుకుంది.

    SRSP Inflow | ఆయకట్టుకు..

    ఎస్సారెస్పీ నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు సైతం నీటిని వదులుతున్నారు. ఎస్కేప్​ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ (Kakatiya Canal) ద్వారా 3,500, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 500, మిషన్ భగీరథ కు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతోంది. మొత్తం 54,187 క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదు అవుతోంది. ఎగువ నుంచి వదర పెరిగితే గోదావరిలో నీటి విడుదలను పెంచుతామని అధికారులు తెలిపారు. గోదావరిలోకి, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి సూచించారు. కాల్వల, నదిలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

    Latest articles

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    Gandhari | దాబాలో యథేచ్ఛగా సిట్టింగ్​లు.. యజమానిపై కేసు నమోదు

    అక్షరటుడే, గాంధారి: Gandhari | పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దాబాల్లో యథేచ్ఛగా సిట్టింగులు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం అమ్మరాదని...

    Heavy rains in North India | ఉత్తరాదిలో భారీ వర్షాలు.. హిమాచల్​లో 298 మంది బలి.. జేకేలో కుంగిన భారీ వంతెన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Heavy rains in North India : ఉత్తర భారత్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి....

    Nizamsagar | మూగబోయిన మాగి గ్రామం.. భజన కళాకారుడు రాములు కన్నుమూత

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని మాగి (maagi) గ్రామానికి చెందిన ప్రముఖ భజన గాయకుడు, గ్రామీణ కళారంగంలో...

    More like this

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    Gandhari | దాబాలో యథేచ్ఛగా సిట్టింగ్​లు.. యజమానిపై కేసు నమోదు

    అక్షరటుడే, గాంధారి: Gandhari | పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దాబాల్లో యథేచ్ఛగా సిట్టింగులు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం అమ్మరాదని...

    Heavy rains in North India | ఉత్తరాదిలో భారీ వర్షాలు.. హిమాచల్​లో 298 మంది బలి.. జేకేలో కుంగిన భారీ వంతెన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Heavy rains in North India : ఉత్తర భారత్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి....