Red Cross | ఉగ్రదాడిలో అమరులకు రెడ్​క్రాస్​ సంతాపం
Red Cross | ఉగ్రదాడిలో అమరులకు రెడ్​క్రాస్​ సంతాపం

అక్షరటుడే, ఇందూరు:Red Cross | పహల్​గామ్​(Pahalgam)లో జరిగిన ఉగ్రవాదుల దాడి(Terrorist Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు తెలిపారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రెడ్​క్రాస్ కార్యాలయం(Red Cross Office)లో శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎవరూ సహించలేరన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కార్యదర్శి అరుణ్ బాబు, జూనియర్ రెడ్​క్రాస్ సమన్వయకర్త అబ్బాపూర్ రవీందర్, సహ కార్యదర్శి పోచయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.