HomeతెలంగాణHeavy Rains | రాష్ట్రంలో ఆ జిల్లాలకు రెడ్​ అలర్ట్​.. ప్రజలు బయటకు రావొద్దని సూచన..

Heavy Rains | రాష్ట్రంలో ఆ జిల్లాలకు రెడ్​ అలర్ట్​.. ప్రజలు బయటకు రావొద్దని సూచన..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Heavy Rains | రాష్ట్రానికి వానగండం పట్టుకుంది. పలు జిల్లాల్లో మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో బుధవారం తెల్లవారుజామునుంచే కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. ముఖ్యంగా కామారెడ్డి(Kamareddy), మెదక్​లలో (Medak) కుండపోత వర్షం కురిసింది. లింగంపేట (Lingampet), నిజాంసాగర్ (Nizamsagar)​ తదితర ప్రాంతాల్లో చెరువులు తెగిపోయాయి. ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. ఇప్పటికే శ్రీరాంసాగర్ (Sriramsagar)​, నిజాంసాగర్​ ప్రాజెక్టు (Nizamsagar Project) గేట్లను ఎత్తి దిగువకు వరదను వదులుతున్నారు. దీంతో దిగువ ఉన్న ప్రాంతాల్లో సైతం వరద చేరి జలమయయ్యాయి.

Heavy Rains | ప్రజలు బయటకు రావొద్దని..

అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి వాతావరణ శాఖ (Meteorological Department) రెడ్​అలర్ట్ (Red Alert)​ ప్రకటించింది. ముఖ్యంగా మెదక్​, నిజామాబాద్​, సంగారెడ్డి, జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే హైదరాబాద్​, అదిలాబాద్​, కొత్తగూడెం, కరీంనగర్​, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, వికారాబాద్​, వనపర్తి జిల్లాల్లో తేలకపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.