అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yeallreddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో (Yella Reddy Government Hospital) ముగ్గురు గైనకాలజిస్టులను వైద్యారోగ్యశాఖ నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్లు (Gynecologists) లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు (MLA Madan Mohan Rao) పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన సమీక్షలోనూ వైద్యుల కొరతపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వైద్యులను నియమించాలని కోరారు.
దీంతో స్పందించిన అధికారులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి ముగ్గురు గైనకాలజిస్ట్లను నియమించారు. వారానికి రెండురోజుల చొప్పున పనిచేసేలా ముగ్గురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.