Maoists | ఆయుధాలు వీడేందుకు సిద్ధం.. మావోయిస్టుల సంచలన లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు (Maoists) సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. కూంబింగ్​ ఆపేస్తే తాము ఆయుధ విరమణ తేదిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు మావోయిస్ట్​ పార్టీ (Maoist Party) లేఖ రాసింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు (Maoists) సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. కూంబింగ్​ ఆపేస్తే తాము ఆయుధ విరమణ తేదిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు.

తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు మావోయిస్ట్​ పార్టీ (Maoist Party) లేఖ రాసింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో వెల్లడింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంకు స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేసింది.

Maoists | ఆపరేషన్​ కగార్​తో..

ఆపరేషన్​ కగార్​తో​ (Operation Kagar) మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. పక్కా సమాచారం కూంబింగ్​ చేపడుతూ.. కీలక నేతలను సైతం ఎన్​కౌంటర్​ చేస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు ఎన్​కౌంటర్​లో చనిపోయారు. ఇందులో పార్టీ అగ్రనేత, కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్​ బసవరాజు మేలో మృతి చెందారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్​కౌంటర్లలో మాడ్వి హిడ్మా (Madvi Hidma), ఆయన భార్య రాజే, టెక్​ శంకర్​ చనిపోయారు. ఎన్​కౌంటర్లలో కీలక నేతలు, కేడర్​ చనిపోతుండడంతో చాలా మంది లొంగిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు లేఖ విడుదల చేయడం గమనార్హం.

Maoists | జోనల్​ కమిటీలకు సమాచారం

కూంబింగ్ ఆపరేషన్ (Coombing Operation) నిలిపివేస్తే ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. బస్వరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని తెలిపింది. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్​ కమిటీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు లేఖలో పేర్కొంది. అయితే ఆపరేషన్​ కగార్​ ఆపడం అనేది కేంద్రం చేతిలో ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related articles

సలహాలకు ఫుల్ స్టాప్.. సర్వీస్ కు భరోసా.. గోద్రేజ్ ఏసీల కొత్త ప్రచార చిత్రం విడుదల

ముంబై: ప్రముఖ గృహోపకరణాల సంస్థ 'గోద్రేజ్ అప్లయన్సెస్' వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ప్రముఖ నటుడు దేవన్ భోజాని ప్రధాన పాత్రలో...

Telangana Cabinet Decisions | రాష్ట్ర కేబినెట్​ నిర్ణయాలపై టీజీఈజేఏసీ హర్షం..

రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయంపై టీజీఈజేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం కమిటీ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​కుమార్​ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Forest Officer Bribery Case | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Officer Bribery Case | మరో అవినీతి తిమింగలం ఏసీబీ (ACB)కి చిక్కింది. రూ.4 లక్షల లంచం తీసుకుంటూ...

SSC Exam Center Rules | ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాల్లోకి సీఎస్​, డీవోలకు ఫోన్లు అనుమతి లేదు..

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతోపాటు చీఫ్ సూపరింటెండెంట్​, డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లకు సెల్​ఫోన్ల అనుమతి లేదని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్​లో అధికారులతో సమావేశం నిర్వహించారు.