ePaper
More
    HomeతెలంగాణRajagopal Reddy | ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధం.. మరోసారి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Rajagopal Reddy | ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధం.. మరోసారి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఆయన సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

    తనకు మంత్రి పదవి రాకపోవడంతో రాజగోపాల్​రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి (Minister Post) ఇస్తానని హామీ ఇస్తేనే కాంగ్రెస్​లో చేరినట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో కేబినెట్​లో చోటు కల్పించకపోవడంతో ఇటీవల సీఎం రేవంత్​రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తనకు పదవుల కంటే నియోజకవర్గ ప్రజలే ముఖ్యమన్నారు.

    Rajagopal Reddy | పదవి వద్దు.. పైసలు వద్దు

    భువనగిరి (Bhuvanagiri) జిల్లా సంస్థాన్ నారాయణపురంలోనీ కేజీబీవీలో పలు అభివృద్ధి పనులను రాజగోపాల్​రెడ్డి ఆదివారం ప్రారంభించారు. పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పదవి ఇచ్చినా సైలెంట్​గా ఉంటానని సీఎం భావిస్తే పొరపాటు అన్నారు. తనకు వారు ఇచ్చే పదవులు.. పైసలు వద్దు అని వ్యాఖ్యలు చేశారు.

    ఆలస్యమైన తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ (RRR) భూ నిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకు వస్తానన్నారు. రీజినల్​ రింగ్​ రోడ్డు నిర్మాణంతో నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...