HomeUncategorizedIndia Pakistan War | యుద్ధానికి సన్నద్ధం..! సరిహద్దు ప్రాంతాల్లో చకచకా బంకర్ల నిర్మాణాలు

India Pakistan War | యుద్ధానికి సన్నద్ధం..! సరిహద్దు ప్రాంతాల్లో చకచకా బంకర్ల నిర్మాణాలు

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: India Pakistan War : జమ్మూకశ్మీర్‌లోని పహల్గావ్​ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భూగర్భ underground బంకర్ల bunkers నిర్మాణాన్ని భారత్​ వేగవంతంగా చేపడుతోంది.

ఏప్రిల్ 22న పహల్గావ్​ ఉగ్రదాడి Pahalgaon terror attack అనంతరం జమ్మూకశ్మీర్ Jammu Kashmir లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం తరచూ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను రక్షించడానికి భారత్​ యుద్ధ ప్రాతిపదికన బంకర్ల నిర్మాణం చేపడుతున్నట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.

పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగిన జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా Samba district లోనూ ప్రజలు అప్రమత్తం అయ్యారు. భారత్ – పాక్ యుద్ధం జరగొచ్చనే ఆందోళనతో ఇక్కడి రామ్‌గఢ్ గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యుద్ధమంటూ జరిగితే తమ ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవడానికి గ్రామంలో భూగర్భ బంకర్ల నిర్మాణం చేపడుతున్నారు.

గతంలోనూ భారత్ – పాక్ యుద్ధాలు జరిగిన సమయంలో జమ్మూకశ్మీర్‌లో వందలాది కుటుంబాలు బంకర్లను నిర్మించుకుని, అందులోనే తలదాచుకున్నాయి. తాజాగా మరోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తత నెలకొనడంతో మళ్లీ అలాంటి బంకర్ల నిర్మాణం కొనసాగుతోంది.