Harish Rao | మరో జల పోరాటానికి సిద్ధం : హరీశ్​ రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మరో జల పోరాటానికి సిద్ధమని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్​లో ఆదివారం ఆయన కృష్ణా జలాలపై పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా నది జలాలపై (Krishna River waters) తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై ప్రజా పోరాటం చేస్తామని హరీశ్​రావు అన్నారు. కమీషన్ల కోసం కొడంగల్ ప్రాజెక్ట్ (Kodangal project) పేరుతో సొంత జిల్లా ప్రజలకు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మరో జల పోరాటానికి సిద్ధమని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్​లో ఆదివారం ఆయన కృష్ణా జలాలపై పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ కృష్ణా నది జలాలపై (Krishna River waters) తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై ప్రజా పోరాటం చేస్తామని హరీశ్​రావు అన్నారు. కమీషన్ల కోసం కొడంగల్ ప్రాజెక్ట్ (Kodangal project) పేరుతో సొంత జిల్లా ప్రజలకు రేవంత్ ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. సీఎం, మంత్రికి కృష్ణా నీళ్లపై అవగాహన లేదన్నారు. తమ హయాంలో నీళ్ల పంపిణీ చేసేవరకు ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి ఇవ్వకుండా ఆపామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక 40 రోజుల్లోనే KRMBకి అప్పగించారని విమర్శించారు. ఈ విషయంలో బీఆర్​ఎస్​ఒత్తిడితోనే ప్రాజెక్టులు వెనక్కి తీసుకున్నారని తెలిపారు.

Harish Rao | 90 టీఎంసీలకు అనుమతులు

పాలమూరు- రంగారెడ్డి డీపీఆర్ జీవో ఇవ్వడానికి కాంగ్రెస్​కు ఆరేళ్లు పట్టిందన్నారు. తామ హయాంలో ఆ ప్రాజెక్ట్​కు 90 టీఎంసీలకు అనుమతులు సాధించామని హరీశ్​రావు పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులను కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. టెలీమెట్రీ పెట్టాలని కేసీఆర్ 2016లోనే ఒప్పించారన్నారు. కేంద్రమంత్రి, జగన్ సమక్షంలోనే పోతిరెడ్డిపాడును కేసీఆర్ వ్యతిరేకించారన్నారు. పోతిరెడ్డిపాడును ఆపకపోతే అలంపూర్ వద్ద ప్రాజెక్ట్​ నిర్మిస్తానని కేసీఆర్ హెచ్చరించారని చెప్పారు.

Harish Rao | వలసలు వాపస్ వచ్చేలా

నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు 99శాతం పూర్తయ్యాయని హరీశ్​రావు చెప్పారు. ప్యాకేజ్-2 పనులు పూర్తి చేసి ఉంటే 50 టీఎంసీల నీళ్లు నింపుకునే అవకాశం ఉండేదన్నారు. కాలువలు తవ్వేందుకు టెండర్లను రద్దు చేశారని విమర్శించారు. బీఆర్​ఎస్​ హయాంలో పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. వలసలు వాపస్ వచ్చేలా కేసీఆర్​ పాలన సాగిందన్నారు.

Harish Rao | 968 టీఎంసీల నికర జలాలు

కాళేశ్వరంలో 968 టీఎంసీల నికర జలాలు ఉన్నాయని మాజీ మంత్రి చెప్పారు. అందుకే నీటి కేటాయింపుల విషయంలో అనుమతులు వచ్చాయని, ప్రాజెక్టు త్వరగా పూర్తయిందన్నారు. నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్, సీడబ్ల్యుసీ అనుమతులు రావన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపినట్లు రేవంత్​రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ హయాంలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికీ, KRMBకి ఫిర్యాదు చేశామన్నారు. పర్యావరణ అనుమతి లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టడంపై ఎన్జీటీలో 2021లో కేసు వేశామని గుర్తు చేశారు. దీంతో ప్రాజెక్ట్​పై ట్రిబ్యునల్ స్టే విధించిందన్నారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...