- Advertisement -
HomeUncategorizedRBI Monetary Policy | ఆర్​బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం

RBI Monetary Policy | ఆర్​బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RBI Monetary Policy | ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) బుధవారం వెల్లడించారు. కాగా ఈ ఏడాది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (Reserve Bank of India) మూడు సార్లు రెపో రేట్​లో కోత పెట్టింది. ఫిబ్రవరిలో 25 బేసిస్​ పాయింట్లు, ఏప్రిల్​లో 25, జూన్​లో 50 బేసిస్​ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో ప్రస్తుతం రెపోరేటు 5.5 శాతంగా ఉంది. తాజాగా జరిగిన సమావేశంలో ఈ వడ్డీ రేటులో మార్పులు చేయకుండా కొనసాగించాలని ఆర్​బీఐ నిర్ణయించింది.

RBI Monetary Policy | అంతర్జాతీయ పరిణామాలతో..

ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. దీంతో వడ్డీరేట్లలో కోత ఉంటుందని భావించారు. అయితే అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా సుంకాలు (US Tariffs) విధించడంతో వడ్డీ రేట్లలో మార్పులు చేయకుండా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ వర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు.

- Advertisement -

RBI Monetary Policy | తగ్గిన ద్రవ్యోల్బణం

దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) అంచనాలకు మించి తగ్గింది. 2.1శాతం తగ్గి 4 శాతం వద్దే కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.1శాతానికి తగ్గొచ్చని ఆర్​బీఐ అంచాన వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నారు. దేశంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున.. ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకునే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం సైతం దిగి రానుంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చితి (International Uncertainty) నేపథ్యంలో ఆర్​బీఐ ఆచితూచి వ్యవహరించింది.

RBI Monetary Policy | పెరిగిన ఫారెక్స్​ నిల్వలు

ఆర్​బీఐ గవర్నర్​ వెల్లడించిన వివరాల ప్రకారం.. జులై 25తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 698.19 బిలియన్​ డాలర్లకు పెరిగాయి. ఇది 11 నెలల గరిష్ట స్థాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా తెలిపింది. స్థిరమైన వస్తువుల ఎగుమతులతో ఈ పెరుగుదల సాధ్యమైందని ఆర్​బీఐ గవర్నర్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రవేశ పెట్టిన జన్​ధన్​ పథకానికి పదేళ్లు పూర్తవుతున్నాయి. దీంతో బ్యాంకులు సెప్టెంబర్ వరకు పంచాయతీ స్థాయి నుంచి రీ-KYC కోసం శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆర్​బీఐ పేర్కొంది. క్లెయిమ్​ల ప్రక్రియను సులభతరం చేయాలని ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తలు కొనసాగుతుండడంతో జీడీపీ వృద్ధిపై ఆందోళనలు నెలకొని ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News