Homeక్రైంEagle Team | హైదరాబాద్​లో రేవ్​పార్టీ భగ్నం.. నిందితుల్లో డిప్యూటీ తహశీల్దార్

Eagle Team | హైదరాబాద్​లో రేవ్​పార్టీ భగ్నం.. నిందితుల్లో డిప్యూటీ తహశీల్దార్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | హైదరాబాద్​ (Hyderabad)లో డ్రగ్స్​ కల్చర్​ రోజురోజుకు పెరిగిపోతోంది. రేవ్​పార్టీలు, బర్త్​ డే పార్టీల పేరిట యథేచ్ఛగా డ్రగ్స్​ వినియోగిస్తున్నారు. ఇటీవల ఈగల్​ టీమ్ (Eagle Team)​ కేసులు నమోదు చేస్తున్న డ్రగ్స్​ దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈగల్​ టీం, గచ్చిబౌలి పోలీసులు ఆపరేషన్​ నిర్వహించి రేవ్​పార్టీ భగ్నం చేశారు.

నగరంలోని గచ్చిబౌలి (Gachibowli)లో గల రాజేశ్వరి నిలయం అనే అపార్ట్​మెంట్​లో రేవ్​ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్​ చేశారు. ఇందులో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్​ కూడా ఉండడం గమనార్హం. కీలక నిందితుడు విక్రమ్‌రెడ్డి సహా 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు తెలిసింది. యువతులను డ్రగ్స్​ పార్టీ కోసం బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Eagle Team | పార్టీల ఏర్పాటు

రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్​ డ్రగ్స్​కు అలవాటు పడ్డాడు. అనంతరం ఆయన కూడా వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. హైదరాబాద్​, గోవా (Goa) వంటి ప్రాంతాల్లో డ్రగ్స్​ పార్టీలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజమండ్రిలోని రిసార్టుల్లో సైతం డ్రగ్స్​ పార్టీలు నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు.

Eagle Team | పరారీలో ఇద్దరు

మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల ఎండీఎంఏ, 20 డ్రగ్స్‌ టాబ్లెట్స్​ స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నిందితుల్లో పలువురికి మల్నాడు డ్రగ్స్​ కేసు (Malnadu Drugs Case) తో సంబంధం ఉన్నట్లు సమాచారం. డ్రగ్ ఫెడ్లర్లు విక్రమ్, తేజ, ముగ్గురు వినియోగదారులు పురుషోత్తం, నీలిమ, భార్గవ్​ను, డ్రగ్స్​ రవాణా చేసే చందన్​ను అరెస్ట్​ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Must Read
Related News