అక్షరటుడే, కోటగిరి:Pension scheme | కొత్త పింఛన్లు (New Pensions) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు రోడ్డెక్కారు. పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో(Rastharoko) నిర్వహించారు.
అనంతరం తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది(Tahsildar Office Staff)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) మాట్లాడుతూ.. కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్కయ్య, శంకర్, అశోక్, హన్మాండ్లు, వెంకట్ రావు, లక్ష్మణ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.