HomeతెలంగాణOperation sindoor | ఆపరేషన్ సిందూర్​కు మద్దతుగా 9న జాగృతి ర్యాలీ

Operation sindoor | ఆపరేషన్ సిందూర్​కు మద్దతుగా 9న జాగృతి ర్యాలీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation sindoor | ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్ operation sindoor ​కు మద్దతుగా ఈ నెల 9న భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి telangana jagruthi సంస్థ ప్రకటించింది.

శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్​లోని పీపుల్స్ ప్లాజా నుంచి 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత MLC Kavitha హాజరవుతారని పేర్కొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ సిందూర్​కు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని సంస్థ కోరింది. భారత సైన్యానికి ప్రజలంతా అండగా నిలవాలని.. సైన్యానికి మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేసింది.

Must Read
Related News