అక్షరటుడే, వెబ్డెస్క్: Rajya Sabha Elections Telangana | రాజ్యసభలో ఖాళీ అవుతున్న సీట్ల కోసం షెడ్యూల్ను ఎన్నికల సంఘం (Election Commission) బుధవారం ఉదయం విడుదల చేసింది. పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజ్యసభ (Rajya Sabha) స్థానాలు ఖాళీ కానున్నాయి. పది రాష్ట్రాల్లో మొత్తం 37 మంది సభ్యుల పదవి కాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో సైతం రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Rajya Sabha Elections Telangana | మహారాష్ట్రలో అత్యధికం
రాజ్యసభలో ప్రతి రెండేళ్లకు ఒకసారి కొంతమంది సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈ క్రమంలో 37 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలను ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 5 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల పరిశీలన మార్చి 6న, ఉపసంహరణ గడువు 9 వరకు ఉంటుంది. 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్లో ముగియనుంది. మహారాష్ట్రలో ఏడు, ఒడిశా నుంచి 3, తమిళనాడు (Tamil Nadu), పశ్చిమ బెంగాల్ (West Bengal) నుంచి 5 చొప్పున సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అస్సాం 3, బీహార్ 4, ఛత్తీస్గఢ్ 2, తెలంగాణలో 2, హర్యానా 1, హిమాచల్ 1 సీటుకు ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ నేత అభిషేక్ సింగ్వి, బీఆర్ఎస్ నేత కేఆర్ సురేష్రెడ్డి పదవి కాలం ఏప్రిల్ 9న ముగియనుంది.