ePaper
More
    HomeజాతీయంHimachal Pradesh | హిమాచల్​ ప్రదేశ్​లో వర్ష బీభత్సం.. 18 మంది మృతి

    Himachal Pradesh | హిమాచల్​ ప్రదేశ్​లో వర్ష బీభత్సం.. 18 మంది మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Himachal Pradesh | ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) పడుతుండడంతో జనజీవనం అతలాకుతలం అయింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్​(Uttarakhand), హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

    హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. క్లౌడ్​ బరస్ట్​ కారణంగా భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా మండి జిల్లాలో 16 వరకు మేఘాల విస్ఫోటనాలు నమోదయ్యాయి. దీంతో వరదల దాటికి దాదాపు వంద ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలా మంది వరదల్లో గల్లంతయ్యారు. వర్షాలతో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అధికారులు, సహాయక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. అధికారులు రోడ్లపై పడ్డ కొండచరియలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...